ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు.
మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాంది, రఘువీరా రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రఘువీరా.. కార్యకర్తలందరూ కాంగ్రెస్తోనే ఉన్నారని అన్నారు.
వేలకోట్లు సంపాదించినవారే పార్టీని వీడారని వ్యాఖ్యానించారు.
ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు