Mass Signature Campaign for Railway Zone by Non-Political JAC
at Beach Road,Visakhapatnam,Vizag Vision….విశాఖ రైల్వే జోన్ తక్షణమే ప్రకటించాలని కోరుతూ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బీచ్ రోడ్డు లోని వై ఎం సి ఏ వద్ద 200 అడుగుల బ్యానర్ పై సంతకాల సేకరణ జరిగింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ విభజన హామీ మేరకు రైల్వే జోన్ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా జోన్ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోకుండా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల17న సాయంత్రం ఏడు గంటల నుంచి18 ఉదయంఏడు గంటల వరకు రైల్వే స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శనలు జరుగుతుందని తెలిపారు. బీచ్ రోడ్డు వకర్స్, విద్యార్థులు, ఎన్ జీ ఓ లు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు సంతకాలు చేశారు. 200 అడుగుల బ్యానర్ బీచ్ రోడ్డులో విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ ఏస్ ఏస్ శివ శంకర్, ఎన్ జీ ఓ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు, లాలం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.