శనివారం కృష్ణాజిల్లా, నూజివీడులో ఆయన వనం-మనం కార్యక్రమాన్ని చేపట్టారు.
ట్రిపుల్ ఐటీ కాలేజీ ఆవరణలో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నెంబర్ వన్ రాష్ట్రం దేశంలో ఉందంటే.. దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు అన్నారు. అది సాధించే శక్తి ఇక్కడ పిల్లలకు ఉందని అన్నారు.
ఇవాళ ఒక్క రోజే కోటి మొక్కలు నాటామని చెప్పారు.
ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో చేస్తున్నామని, ఈ ఏడాది 25 కోట్లు మొక్కలు నాటాలని సీఎం పిలుపు ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేస్తామని ఆయన అన్నారు.
ఇళ్లలో చెట్లు పెంచడం కాదని, చెట్లలో ఇళ్లు కట్టుకునే పరిస్థితి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలాగే చెట్లలో గ్రామం ఉండే పరిస్థితి రావాలన్నారు.