Tobacco Business Gutka,Pan Masala can be do legally by Bhim Lingeswarar Rao,Visakhapatnam,Vizag Vision..హైకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ పోలీసులు, ఫుడ్ సేప్టి అధికారులు గుట్కా, పొగాకు ఉత్పత్తుల అమ్మకాల పేరుతో తప్పుడు కేసులు పెట్టి,వేధింపులకు గురి చేస్తున్నారని, తన కుటుంబ జీవన హాక్కులను
కాలరాస్తున్నారని, తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ప్రముఖ పొగాకు ఉత్పత్తుల వ్యాపారి కొండ భీమ శంకర్
వేడుకున్నారు.
మంగళవారం ఉదయం స్థానిక హోటల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఈ ఏడాది జూన్ 28న ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు తీర్పునిస్తూ పొగాకు ఉత్పత్తులు సీఓటిపిఏ యాక్ట్ కింద వస్తుందని ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.
పొగాకు ఉత్పత్తులైన ఖైనీ,గుట్కా తదితర ఉత్పత్తులను పోలీస్ శాఖ, ఫుడ్ సేప్టి శాఖ , ప్రభుత్వం గాని నిషేధించే హక్కు లేదని తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.
నిజం గా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్త శుద్ధి ఉంటే గంజాయి పంటను నిషేధించినట్టే పొగాకు పంటను కూడా నిషేధించాలని కోరారు.
అదే విధంగా మధ్య పానం, ధూమ పానం, పొగాకు ఉత్పత్తుల మీద వున్న జిఎస్టీ 188 శాతం పన్ను ను కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పొగాకు పంటకు బోర్డు పెట్టి పంట సబ్సిడీ ఇవ్వడం, పాన్ మసాలకు ,సిగరెట్లకు సినిమాల్లో,టీవీల్లో ,పత్రికల్లో
ప్రచార ప్రకటనలు ఇవ్వడం
ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.ఉత్తరాంధ్రలో గానీ ఒరిస్సాలో గానీ పొగాకు ఉత్పత్తుల వ్యాపారాలు, అమ్మకాలు,రవాణా విషయాలలో పోలీసులు,ఫుడ్ సేప్టి అధికారులు దాడులు నిర్వహించినప్పుడు తనను ఒక్కడినే టార్గెట్ చేస్తూ అనేక రకాలైన క్రిమినల్ కేసులు బనాయిస్తూ చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా పలు సార్లు జైలుకు పంపిస్తున్నారని వేదన వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుట్కా, ఖైనీ ఉత్పత్తుల పై ప్రభుత్వ నిషేధం అమలవుతుందని పొరుగున ఉన్న కర్ణాటక,తమిళనాడు,ఒరిస్సా,బెంగాల్ ,ఛత్తీస్ ఘడ్ లలో నిషేధం లేకపోవడం తో అక్కడ తమ బంధువులు జిఎస్టీ లైసెన్స్ తెచ్చుకుని చట్ట బద్ధంగా వ్యాపారాలు చేస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
ఈ వ్యవహారం లో తెగణకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా తన పై అక్రమంగా కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.
గుట్కా,ఖైనీ అక్రమ వ్యాపారాల పేరుతో పోలీసులు, ఫుడ్ సేప్టి అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తూ బెదిరించి లక్షల రూపాయిల లంచాలు గుంజుతున్నారని ఆరోపించారు. వాస్తవంగా ప్రభుత్వానికి రావాలిసిన కోట్లాది రూపాయల ఆదాయాన్ని అక్రమంగా కొల్లగోడుతున్నారని ఆరోపించారు.