విశాఖజిల్లా చీడికాడ మండలం చుక్కపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు .వివరాల్లోకి వెళితే……..?
చుక్క పల్లి గ్రామంలో సామంతుల భవాని( 40) సంవత్సరములు అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావుతో 13 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది .వీరికి ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెద్దపాప జయంతి 12 సం” రెండో పాప వరలక్ష్మి (8)సం” భవాని భర్త శ్రీనివాసరావు కిడ్నీ వ్యాధితో 2 సంవత్సరాల క్రితం మృతి చెందాడు .తనకు వచ్చినటువంటి పొలము సాగుచేసి పండించుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు విధి ఆడిన వింత నాటకంలో నిన్న సాయంత్రం స్కూల్ విడిచిన తర్వాత పిల్లలతో భవాని తన పొలంలోకి గడ్డి కోసం వెళ్లడం జరిగింది నిన్న సాయంత్రం సంధ్యాసమయం మించిపోయిన నప్పటికీ గడ్డి కోసం వెళ్ళిన తన అక్క భవాని ఇంకా రాలేదని భవాని తమ్ముడు అయిన జగ్గారావు పొలంలోకి వెళ్లడం జరిగింది తన పొలంలో కి వెళ్ళి వెతకసాగడు చివరకు నేలభావి లో మృతదేహం చూసి జగ్గారావు గ్రామంలోకి వెళ్లి పెద్దలందరికీ చెప్పి తీసుకురావడం జరిగింది. గ్రామస్తులంతా మృతదేహాలను బయటకు తీసారు. గ్రామ సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకొని పరిశోధన కొనసాగించారు.
పోలీసులు దర్యాప్తు లో బహుశా చిన్న పాప మంచినీళ్ల కనే వెళ్లి కాలుజారి నెల బావిలో పడి ఉండి ఉండవచ్చని పాప తాలూకా చెప్పులు బావిలో కనబడుతున్నాయని పోలీసులు తన పరిశోధనలో భాగంగా చెప్పడం జరిగింది .ఇదే కాక ఇంకా ఏమైనా సంఘటన జరిగి ఉండవచ్చునని అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నామని చోడవరం సీఐ శ్రీనివాసరావు అభిప్రాయాన్ని తెలియజేశారు .