కైలాస మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న విజయవాడ చిట్టినగర్కు చెందిన 16 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండో-టిబెట్ సరిహద్దులో మంచు తుఫాన్ కారణంగా యాత్రికులు ఎక్కడికీ కదలేని పరిస్థితి ఉందని ఏపీ భవన్ కమిషనర్ శ్రీకాంత్కు నేపాల్ భారతీయ ఎంబసీ కార్యాలయం తెలిపింది.
తుఫాన్ తగ్గిన వెంటనే యాత్రికులను తిరిగి పంపుతామని పేర్కొంది.
యాత్రికులకు వైద్య సదుపాయాలు అందజేస్తున్నామని నేపాల్ భారతీయ ఎంబసీ కార్యాలయం తెలిపింది.
మానససరోవర్ యాత్రకు వెళ్లిన 16 మంది యాత్రికులు ఇండో-టిబెట్ సరిహద్దులో మంచు తుఫాన్ రావడంతో అక్కడే ఉండిపోయారు.
ముందుకు వెళ్లలేక…వెనక్కి రాలేక యాత్రికుల అవస్థలకు గురయ్యారు.
విషయం తెలిసిన కలెక్టర్ లక్ష్మీకాంతం బాధితులతో ఫోన్లో మాట్లాడారు.
యాత్రికులకు మందులు, ఆహారం సరఫరా చేయాలని ఏపీ భవన్ అధికారులను కోరారు.
అయితే తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు నేపాల్ భారతీయ ఎంబసీ ప్రకటించడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.