ఉత్తరాంద్ర జిల్లాల ఆరాధ్యదైవం , సింహచలం సింహద్రి అప్పన్న దేవస్థానంలొ పలు అభివృద్ది పనులను దేవస్తానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు , రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు లు ప్రారంభించారు . స్వామివారి విగ్రహం, తొలిపావంచా కు 75 లక్షల వ్యయంతో నిర్మించారు . దీనితోపాటు సింహగిరి ఘాట్ రోడ్ లొ ఎర్పాటు చేసిన సుమారుగా 10 అడుగుల దశావతారాల విగ్రహాన్ని కుడా ప్రారంభించారు . ఈ సందర్బంగా వారు మాట్లడుతూ , పర్యావరణాన్ని ఒక ప్రక్క ప్రతీవారు కాపాడుతూ, అందుకు తగ్గట్లుగా ఇంటువంటి అభివృద్ది కార్యక్రమాలను చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైన ఉందని ఆన్నారు . సింహచలం అంతా దివ్యక్షేత్రంగా ఇంతవరకు 60 శాతానికి పైగా పూర్తి అయిందని, ఇంక భక్తులకు ఒక పర్యాటక కేంద్రంగా కుడా తీర్చి దిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు సత్యన్నారాయణ, గణబాబు , ఈఓ రామచంద్రమోహన్ , విజెఎఫ్ అద్యక్షుడు గంట్ల శ్రీనుబాబు భారీగా భక్తులు పాల్గొన్నారు.