జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ రాజీనామా,..
జమ్మూకశ్మీర్లో అధికార పీడీపీతో భారతీయ జనతా పార్టీ తెగతెంపులు చేసుకుంది. దీంతో జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన అనంతరం మెహబూబా ముఫ్తీ మీడియాతో మాట్లాడారు.”బీజేపీ నిర్ణయం నాకు ఆశ్చర్యమేమీ కలిగించలేదు. మేం అధికారం కోసం పొత్తు పెట్టుకోలేదు.
కశ్మీర్లో శాంతి నెలకొల్పేందుకు చేయాల్సిందల్లా చేశాం. ఏకపక్ష కాల్పుల విరమణకు, 11,000 వేల మంది యువతపై ఉన్న కేసుల ఉపసంహరణకు కృషి చేశాం.
రంజాన్ సందర్భంగా పాటించిన కాల్పుల విరమణ వల్ల కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణం నెలకొంది.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్కు పత్రాన్ని సమర్పించాను. ఇక ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమని చెప్పాను” అని ఆమె అన్నారు.
గవర్నర్కు బీజేపీ లేఖ,,..పీడీపీ ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని చెబుతూ గవర్నర్ ఎన్ఎన్ వోరాకు బీజేపీ ఓ లేఖను పంపింది.
జమ్మూకశ్మీర్లో 2016 నుంచి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.
జమ్మూకశ్మీర్ బీజేపీ ఇన్చార్జి రామ్ మాధవ్.. తాము పీడీపీ ప్రభుత్వం నుంచి వైదొలగడానికి కారణాలను వివరించారు.
ఈ మేరకు ఆయన ఢిల్లీలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడేళ్లలో జమ్మూకశ్మీర్లో శాంతి భద్రతలు దిగజారాయని తెలిపారు.
గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలపై వివరాలు తెలుసుకున్న అనంతరం ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల అభిప్రాయం మేరకు సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమని నిర్ణయించుకున్నట్లు రామ్మాధవ్ తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారి హత్యకు గురి కావడం కూడా తాము మద్దతు ఉపసంహరించుకోవడానికి ఒక కారణంగా పేర్కొన్నారు.
అయితే బీజేపీ తన వైఫల్యాల నుంచి తప్పించుకోజాలదని కాంగ్రెస్ అంది.
అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అమెరికా ‘స్పేస్ ఫోర్స్’
EPA
కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్, ”కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పును ఒప్పుకున్నందుకు సంతోషం. ఈ మూడేళ్లలో పీడీపీ-బీజేపీ పాలన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది” అన్నారు.
బీజేపీ మొత్తం బాధ్యతను పీడీపీపై నెట్టివేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
జమ్మూకశ్మీర్లో మొత్తం 87 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో పీడీపీకి 28 సీట్లు ఉండగా.. బీజేపీ 25 సీట్లతో రెండో స్థానంలో ఉంది.
ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్కి 15 సీట్లు, కాంగ్రెస్కి 12 సీట్లు ఉన్నాయి.