Airport Timings issue. AP Air Travelers Assn, AP Chamber of Commerce,Visakhapatnam,Vizagvision..విశాఖ ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలపై నేవీ అధికారులు ఆంక్షలు విధించారు. దీనిపై విమాన ప్రయాణికులు సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆంక్షల వల్ల వివిధ రంగాలపై పెను ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేవీ విధించిన ఆంక్షలు దేశీయ విమాన సర్వీసులతో పాటు విదేశీ సర్వీసులపై పెను ప్రభావం చూపనుంది. విశాఖ లో విస్తరించిన ఐటి, ఫార్మా, అపారెల్ పరిశ్రమలతో పాటు టూరిజంపై దీని ప్రభావం ఉంటుందని వాణిజ్య వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నవంబరు నుంచి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. అలాగే ప్రతీ మంగళ, బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.. విశాఖ విమానాశ్రయంలో రాకపోకలు ఆపేయాల్సిందిగా తూర్పు నావికాదశం ఏఏఐకి లేఖ పంపింది. ఈ నిషేధం ఎప్పటివరకు ఉంటుందనేది స్పష్టత లేదు. ఇది దేశ, విదేశీ రాకపోకలపై ప్రధానంగా పర్యటకం మీద తీవ్ర ప్రభావం చూపించనుంది. ఏటా విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 24 లక్షల మంది వరకు విమాన సర్వీసులను వినియోగించుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలోనే తీసుకుంటే 1836 దేశీయ విమానాలు, 155 విదేశీ సర్వీసులు తిరిగాయి. గతేడాది ఏప్రిల్తో పోల్చితే.. దేశీయంగా 21.2 శాతం, విదేశీయంగా 32.5 శాతం విమాన సర్వీసులు పెరిగాయి. నిషేధం నవంబరు నుంచి అమలవుతుంది కాబట్టి.. ప్రత్యేకించి నవంబరు మాసాల్లో పురోగతి చూస్తే.. 2017కి 2018కి మధ్య 45.6 శాతం అంతర్జాతీయ ప్రయాణికులు పెరిగినట్లు స్పష్టంగా ఉంది. వీరంతా పర్యటకం నేపథ్యంలో నగరానికి వచ్చినవారే.శ్రీలంకన్ ఎయిర్లైన్స్తో పాటు ఎయిర్ఇండియా, అలయన్స్ ఎయిర్, ఎయిర్ఏషియా, ఇండిగో, ఎయిర్ఇండియా, స్పైస్జెట్, శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఇందులో ఉన్నాయి. ప్రతీ మంగళ, బుధవారాల్లో రాత్రి 7 నుంచి 9 గంట మధ్య విజయవాడ, బెంగళూరు, కోల్కతా, చెన్నై విమాన సర్వీసులకు విఘాతం కలగనుంది. విశాఖ వరకు ఆగస్టు – జనవరి మధ్య మాసాలు చాలా కీలకం. ఆ రోజుల్లో అత్యధిక పర్యటకులు నగర సందర్శన చేస్తున్నారు. ఒక విమానంలో 180 సీట్లుంటే అందులో 70నుంచి 80సీట్లు కేవలం పర్యటకంలో భాగంగా వస్తున్న వారివే ఉంటున్నాయి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం నెలకు 2500 మంది పర్యటకులు కేవలం విమానాల ద్వారా విశాఖకు వస్తున్నారు. వీరు ప్రధానంగా విశాఖ, హైదరాబాద్, కోల్కతా మీదుగా సర్క్యూట్ ప్యాకేజీలతో వస్తున్నారు. అరకు అందాలు, బౌద్ధ ఆరామాలు, విశాఖ నగరంలో ఉన్న ఆకర్షణలు.. వీటి కారణంగా ఆగష్టు నుంచి చాలా ప్రైవేటు ఏజెన్సీలు పర్యటక ప్యాకేజీల్ని ఇదివరకే ప్రకటించాయి. నగరం చుట్టుపక్కల భారీగా 3, 5 స్టార్ హోటళ్లు ఉన్నాయి. సీజన్లో అవి పూర్తిగా పర్యటకులతోనే నిండి ఉంటాయి. వీరివల్ల ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతోంది. నిషేధాజ్ఞల కారణంగా ఏజెన్సీల దగ్గర నుంచి హోటళ్లు, పర్యటక ఆదాయం మొత్తం కలిపి.. రోజుకు కనీసమంటే రూ.15 లక్షల వరకు నష్టం కలిగే అవకాశం కనిపిస్తోందని నిపుణుల అంచనా. పైగా ఇలా ప్యాకేజీల మీద ఆధారపడే వారంతా 6 నెలల ముందునుంచే బుకింగ్లు మొదలు పెడుతున్నారు. వీటిలో కొంతవరకు అలజడి చెలరేగే అవకాశం ఉంది.