Under Construction Flyover Collapses In Varanasi,vizagvision..ఉత్తర ప్రదేశ్లోని వారణాసి కంటోన్మెంట్ ఏరియాలో మంగళవారం నిర్మాణంలో వున్న ఫ్లైఓవర్లో కొంత భాగం కూలిపోవడంతో 26మంది మరణించారు.
ఆ వంతెన కింద పలువురు సమాధి అయివుంటారని పోలీసుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే సంఘటనా స్థలానికి సీనియర్ పోలీసు అధికారులు, పాలనా యంత్రాంగం అధికారులు చేరుకున్నారు.
శిధిలాల కింద అనేకమంది చిక్కుకుని వుండవచ్చునని అనుమానిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.
ఈ సంఘటనలో కొన్ని వాహనాలు కూడా నుజ్జు నుజ్జయ్యాయని చెప్పారు.
ఈ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించాల్సిందిగా ఆయన డిప్యూటీ సిఎం కె.పి.మౌర్య, మంత్రి నీల్కాంత్ తివారీలను ఆదేశించారు.
సహాయక చర్యలను వేగిరపరచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఆరోగ్య మంత్రి సిద్ధార్ధ నాథ్ సింగ్ తెలిపారు.
కాగా ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియచేశారు.