Boat capsize in Godavari river 40 feared drowned,Vizagvision..ఉభయగోదావరి జిల్లాల సరిహద్దు దేవీపట్నం మండలం మంటూరు దగ్గర గోదావరిలో సంభవించిన లాంచీ ప్రమాదం
గాలి బలంగా వీస్తుందని తలుపులు మూసివేయడంతో సుడిగాలిలో చిక్కుకుని మునిగిన లాంచీ,కంగారులో ప్రయాణికులంతా ఒకవైపుకు ఏరుకోవటంతో ప్రమాదం సంబవించిదని సమాచారం
ప్రమాద సమయంలో బోటులో 50 మంది ప్రయాణికులు ఉండచ్చని సమాచారం
అప్రమత్తమైన 6గురు ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు
ప్రమాదంలో బయట పడిన 6గురు లొ ముగ్గురు బోటు సిబ్బంది, కాగా ముగ్గురు ప్రయాణికులు..
దర్మాకోల్ సాయంతో ఒడ్టుకు ఈదుకుంటూ వచ్చిన అశ్విని (14) అనే బాలిక
మరో 43 మంది దాకా గల్లంతు. పోలవరం నుంచి కొండమొదలు వెళ్తుండగా ప్రమాదం
అలెర్ట్ ఐన పశ్చిమ , తూర్పు గోదావరి జిల్లాల పోలీసులు, అధికారులు..
పోలవరం లో వర్షం కారణంగా ఘటన జరిగిన ప్రదేశాన్ని గుర్తించి చేరుకోలేని పరిస్తితి
బ్యాంకు లావాదేవీలకి సంబందించి పని మీద వచ్చిన అత్యధిక ప్రయాణీకులు
తూర్పుగోదావరి జిల్లా నుండి గోదావరి తీర గ్రామాలనుండి బోటు ఎక్కిన గిరిజనులు
తాళ్ళూరు, గొందూరు , కత్తులూరు , పెడితేరు, పెద్దగూడెం గోదావరి తీర ప్రాంతానికి చెందిన గిరిజనులు
ప్రమాదంలొంచి బయట పడ్డ బోటు సిబ్బంది నేరం.పుల్లయ్య, వెంకటేశ్వరరావు
దేవీపట్నం పోలీస్టేషన్ లో లొంగి పోయిన లాంచి యజమాని ఖాజావలీ