దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.
జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా శనివారం ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
కాకినాడలోనూ భారీ వర్షం కురిసి రహదారులు జలమయమయ్యాయి.
విశాఖ నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.
కడప జిల్లా వీరబల్లె, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం, కరప, బిక్కవోలు, విశాఖ రూరల్, విశాఖ అర్బన్, రోలుగుంట, చోడవరం, దేవరాపల్లి, విజయనగరం జిల్లా జామి, వేపాడ మండలాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.