రెండురోజుల షెడ్యూల్లో భాగంగా శుక్రవారం తొలుత ఆయన జనక్పూర్లోని జానకీ ఆలయాన్ని సందర్శించారు.
అనంతరం జనక్పూర్-అయోధ్యల మధ్య బస్ సర్వీస్ను కూడా ప్రారంభించారు.
అయితే శనివారం షెడ్యూల్లో భాగంగా మోదీ ముక్తినాథ్, పసుపతినాథ్ ఆలయాలను సందర్శించనున్నారు.
అదేరోజు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
పసుపతినాథ్లోని శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు.
అయితే కర్ణాటకలోని లింగాయత్లు శివుడిని ఇదే రూపంలో పూజిస్తారు. అక్కడ లింగాయత్ ఓట్లు కోల్పోకూడదనే ఉద్దేశంతోనే అక్కడకు వెళ్లినట్లు సమాచారం.
అయితే రేపు మోదీ ఆయా ఆలయాలను సందర్శించుకునేటప్పుడు ఆ వార్తలను కానీ, లేదా ఆ పర్యటనకు సంబంధించి ఏ అంశాన్నీ ప్రసారం చేయకూడదని ఎన్నికల సంఘం ఆయా ఛానెల్స్కు ఆదేశాలు జారీ చేసింది.
ప్రసారం చేయడం వల్ల ఓటర్లను ప్రభావితం చేసినట్లవుతందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మోదీ ఎన్నికల సమయంలో ఆలయాలు సందర్శించడం కొత్తేం కాదు.
గుజరాత్ ఎన్నికల సమయంలోనూ ఇదే చిత్రం చోటు చేసుకుంది.
ఎన్నికల జరిగే రోజున ఆయన చేసిన రోడ్షో ఎపిసోడ్, స్థానిక ఆలయాలను సందర్శించిన ఎపిసోడ్లను స్థానిక మీడియా ప్రసారం చేసింది.
దీంతో చివరి నిమిషంలో గుజరాత్ ఓట్ల గణాంకాలు మారిపోయాయని సమాచారం.