భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలోని సీఎంవోలో బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. క్రీడలకు, క్రీడాకారులకు ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రోత్సాహాన్ని లక్ష్మణ్ అభినందించారు. గత హయాంలోనూ అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా అకాడమీలు రాష్ట్రంలో ఏర్పాటయ్యేలా ముఖ్యమంత్రి కృషి చేశారని గుర్తు చేశారు. క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా యువ క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా వుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు