VIZAGVISION: 3lks Fishess Delivery in Krishna Revier,Vijayawada…కృష్ణా నదిలో మత్స్య సంపద అభివృద్ధి చేసే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మత్స్య శాఖ “మిషన్ ఫింగర్ లింక్స్” పధకం ద్వారా శీలవాతి (రోహు) రకానికి చెందిన 13.50 లక్షల మేలైన చేపపిల్లలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తుమ్మలపాలెం లో శుక్రవారం సాయంత్రం కృష్ణానదిలో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చేపపిల్లలు పెరిగి పెద్దవగుట ద్వారా మత్స్య సంపద గణనీయంగా పెరిగి కృష్ణా నదీతీర ప్రాంతాలకు చెందిన విజయవాడ, ఇబ్రహింపట్నం, కంచికచర్ల, చందర్లపాడు, మరియు జగ్గయ్యపేట ఐదు మండలాల పరిధిలో ని 25 గ్రామాలకు చెందిన దాదాపు 5వేల మత్స్య కారుల కుటుంబాలకు జీవనోపాధి మెరుగు పడుటకు దోహదపడుతుందని మంత్రి ఉమా అన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు రూ. 16,16,500ల సబ్సిడీతో బోట్లు, వలలు, మోపెడ్లు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు