సంఘటనలు
- 1908 – ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం బాధ్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1914 ఏప్రిల్ 1 నాడు దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై).
జననాలు
- 1892: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, ప్రసిద్ధ పండితులు మరియు రచయిత.
- 1914: కాళోజీ నారాయణరావు, ప్రముఖ తెలుగు కవి, తెలంగాణావాది.
- 1935: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు.
- 1953: సి.హెచ్. మల్లారెడ్డి, 16వ లోక్సభలో మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు.
- 1961: సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్లో నిపుణురాలు.
- 1963: లక్ష్మీ. టి, ప్రముఖ రంగస్థల నటి.
- 1987: తథాగత్ అవతార్ తులసి, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బాలమేధావి.
మరణాలు
- 1952: వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన సుప్రసిద్ద ఇంజనీరు.
- 1978: జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్), చిత్రాల రారాజు. హాలీవుడ్లో ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ ఒకటి.
- 2003: గులాబ్రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే.