VIZAGVISION;”Times Of India”More Reasons for Vizag to be Happy .Visakhapatnam…
జిల్లా కేంద్రంలో రానున్న కాలంలో నవ్యాంధ్ర ఆర్థిక ప్రగతికి విశాఖ ముఖ్య కేంద్రం కానుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
విశాఖలో టైమ్స్ ఆఫ్ ఇండియా విశాఖ ఎడిషన్ ప్రారంభోత్సవానికి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రోన్ల తయారీ కేంద్రంగా విశాఖ రూపొందనుందని.. ఈ పరిశ్రమ ప్రారంభానికి తాను 60రోజుల్లో మళ్లీ విశాఖకు రానున్నట్లు లోకేశ్ స్పష్టం చేశారు.
ఒకవైపు విశాఖలో భూమి కొరత ఉందని అంటుందే.. మరోవైపు తమ తమ స్థలాలు కొనేవారే లేరని రియల్ఎస్టేట్స్ సంస్థలు చెబుతున్నాయని.. ఈ పరిస్థితిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
రానున్న కాలంలో పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై డ్రోన్లతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
దక్షిణాసియాలో పెట్టుబడులు పెట్టేవారికి విశాఖ ఉత్తమ ఆకర్షణగా నిలవనుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.