గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొప్పరపు కవుల విగ్రహాల ప్రతిష్ఠ…. ఈ సందర్బంగా మీడియాను ఉద్దేశించి వివరించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి….. కొప్పరపు కవుల మొట్టమొదటి అవధానం, అవధాన యాత్ర సుమారు 120ఏళ్ళ క్రితం నరసరావుపేటలోనే ప్రారంభమైంది. కవుల సంస్కృత విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడికి కాస్త దూరంలోనే కొప్పరపు కవుల స్వగ్రామం కొప్పరం ఉంది. కొప్పరపు కవులు పలనాడు, కొండవీడు ప్రాంతానికి చెందినవారు కావడం విశేషమని, తెలుగు జాతికి చెందిన ఇంతటి మహనీయుల విగ్రహాలు నరసరావుపేటలో, కవుల సీమలో స్థాపించుకోవడం ఎంతో సంతోషదాయకమని ఎమ్ ఎల్ ఎ గోపిరెడ్డి తెలిపారు. నరసరావుపేట మున్సిపల్ కమీషనర్ శివారెడ్డి, కొప్పరపు కవుల మనుమలు మాశర్మ, వేంకటసుబ్బరాయశర్మ (బాలకవి )ఇందులో పాల్గొన్నారు. త్వరలో జరిపే ఈ ఉత్సవానికి ఉప సభాపతి కోన రఘుపతి, స్థానిక పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు, అధికారభాషాసంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రఖ్యాత నటుడు బ్రహ్మానందం, ప్రభుత్వ సలహాదారుడు సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి తదితరులు పాల్గొంటారని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు- మాశర్మ