Awareness of Traffic Safety by Sri Sathya Sai Women’s Youth Division in Visakhapatnam…
శ్రీ సత్య సాయి మహిళా యువజన విభాగం చే ఆధ్వర్యంలో ట్రాఫిక్ భద్రత గురించి అవగాహన
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 94 వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు ఎంతో రద్దీగా ఉండే మద్దిలపాలెం జంక్షన్ వద్ద, గాజువాక జంక్షన్ ల్లో శ్రీ సత్య సాయి మహిళా యువజన విభాగం ఆధ్వర్యంలో ట్రాఫిక్ భద్రత గురించి అవగాహన కల్పించడం కోసం ప్లకార్డ్స్, బ్యానర్లు పట్టుకుని 2 గంటల పాటు వాహన చోదకులకు/ ప్రయాణీకులకు సేఫ్టీ హెల్మెట్ వాడకం గురించి, త్రాగి వాహనాలు నడుపరాదని, భద్రతా నియమాలు పాటించాలని, వేగంగా వాహనాలు నడుపరాదని, సేఫ్టీ బెల్ట్ వాడాలని, ఎవరి లైన్ డిసిప్లిన్ పాటించాలని వంటి ట్రాఫిక్ భద్రతా అంశాలమీద అవగాహన కల్పించారు.
ఏంటో రద్దీగా ఉండే మద్దిలపాలెం, గాజువాక జంక్షన్స్ లలో వాహన చోదకులకు దయచేసి హెల్మెట్లను ధరించమని, ట్రాఫిక్ భద్రత నియమాలను పాటించమని శ్రీ సత్య సాయి మహిళా యువత అందరినీ ముకుళిత హస్తాలతో అభ్యర్ధించడం ట్రాఫిక్ పోలీస్ వారినీ, ప్రయాణీకులను ఎంతగానో ఆకట్టుకుంది. తమ స్కాటర్, మోటార్ సైకిల్ కి హెల్మెట్లను తగిలించి వెళుతున్నవారు, వీరి అభ్యర్థనకు వెంటనే హెల్మెట్స్ తీసి తలకు ధరించారు. హెల్మెట్ వేసుకొని వారు తప్పు చేసిన భావంతో తప్పకుండా సేఫ్టీ హెల్మెట్లు వేసుకుంటామని శ్రీ సత్య సాయి మహిళలకు హామీ ఇచ్చారు.
మద్దిలపాలెం ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ స్వామి నాయుడు, కానిస్టేబుల్ శ్రీ జగదీశ్వర రావు తీవ్రమైన ఎండను సహితం లెక్క చేయకుండా 2 గంటలపాటు అందరినీ ట్రాఫిక్ భద్రత నియమాలను పాటించమని కోరడాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నిస్వార్ధ సమాజ సేవలో శ్రీ సత్య సాయి సేవా సంస్థల సేవలను వారు, ప్రజలు కొనియాడారు.