రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియాకు కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
ఈ పర్యటనలో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ కానున్నారు.
అగ్రనేతలిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల్లో నూతన శకానికి నాంది పలుకుతుందని పర్యటనకు బయలుదేరే ముందు వ్యాఖ్యానించారు మోదీ.