జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్లోని బస్స్టాండ్ సమీపంలో గ్రనేడ్ దాడి చేశారు.
ఈ ఘటనలో 20 మంది పౌరులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వీరు ప్రస్తుతం శ్రీనగర్లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఘటన అనంతరం.. అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని నిర్బంధించి సోదాలు నిర్వహిస్తున్నాయి