YSRCP Konda Rajiv Criticizes Pawan Kalyan After Defeat not Showing Face to people in Visakhapatnam,Vizagvision…
ఎపి వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ కామెంట్స్:
గాజువాకలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓటమి తర్వాత తనకు ఓట్లు వేసిన యాభై ఎనిమిది వేలమందికి ముఖమే చూపలేదని కొండా రాజీవ్ విమర్శించారు. ఈ రోజు విశాఖలొ ఇసుకమీద లాంగ్ మార్చ్ చేస్తానని ఏ ముఖం పెట్టుకు వస్తారని ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడు అన్న సామెత పవన్ కు సరిపోతుందన్నారు. విశాఖ వచ్చేముందు పవన్ గాజువాక, భీమవరం వెళ్లి తనకు ఓట్లు వేసిన వారిని కలిస్తే బాగుంటుందన్నారు. ఏపీలో ఎప్పటినుంచో పవన్, చంద్రబాబులు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారనీ, పవన్ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ లా మారాడనీ ఎద్దేవా చేశారు. భిమవరం, గాజువాకలో చంద్రబాబు, మంగళగిరి, కుప్పంలొ పవన్ కల్యాణ్ ప్రచారాలు చేయకపోవటానికి కుమ్మక్కు రాజకీయాలు కారణమని చంద్రబాబే బయటపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. వేల పుస్తకాలు చదివాననే పవన్ కల్యాణ్ కి ఇంటర్వ్యూకీ, అపాయింటుమెంటుకీ తేడా తెలీకపోవటం విచారకరమన్నారు. అమిత్ షా ఎపి ముఖ్యమంత్రితో 45 నిమిషాలు చర్చలు జరిపితే చంద్రబాబుకి కడుపు మండిందనీ, వెంటనే ఆయన దత్తపుత్రుడైన పవన్ రంగంలోకి దిగి ఈ సమావేశం మీద విమర్శల దాడి ప్రారంభించారనీ అన్నారు.
పవన్ కల్యాణ్ నిర్మాణ కార్మికుల మీద కపటప్రేమ మాని తన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు.
ఇటీవలే ఎఇపి వైకాపా అధికార ప్రతిధిగా నియమితులైన కొండా రాజీవ్ గాంధీ తనకు ఈ అవకాశం ఇచ్చిన జగన్ కు, విజయసాయిరెడ్డికి, సహకరిస్తున్న వారికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.