సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షికమహోత్సవాలలో భాగంగ స్వామివారికి వసంతోత్సవం , చక్రసాన్నం మహోత్సవాన్ని వేడుకుగా నిర్వహించారు.ప్రాతఃకాలమే స్వామివారికి సుప్రభాతసేవ , ఆరాదన బాలభోగము ఆనంతరం స్వామివారికి వసంతోత్సవంను నిర్వహించారు.వసంతోత్సంలో ఆలయ ఆర్చకులు , పండితులు భక్తులు ఒక్కరిపై మరోకరు చూర్ణాలను జల్లుకోని సంబరాలను జరుపుకున్నారు.అనంతరం దేవాలయానికి ఈశాన్యమూలగల ఆకాశగంగ వద్దకు స్వామిఅమ్మవార్లను పల్లకిలో తీసుకొచ్చి మండపంలో అధిష్ఠింపచేసి విష్వక్సేన ఆరాదన, శోడషోపచారపూజులు జరిపిన అనంతరం పంచమృతాలతో స్నపనతిరుమంజనసేవ నిర్వహించి చక్రసాన్న మహోత్సవం నిర్వహించారు.భక్తులు ఉత్సవంలో పాల్గోని తీర్ధప్రసాదాలను స్వీకరించారు