వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసిన నిందుతుడు శ్రీనివాస్ కేసు ఈ రోజుతో రిమాండ్ పూర్తికావడంతో విశాఖ మెట్రోపాలిటిన్ కోర్ట్ లో హజరు పరచారు. జగన్ పై దాడి కి సంభందించి క్షేత్ర స్ధాయిలో విచారణ పూర్తి కాకపోవడంతో కేసు మరో 14 రోజులు కోర్ట రిమాండ్ పొడిగించింది. దాడి సమయంలో జగన్ ధరించిన షర్ట్ ను కోర్టులో ప్రవేశపెట్టినట్లు జగన్ తరుపు న్యాయవాది చిన్నారెడ్డి తెలిపారు. షర్ట్ ని సిట్ అధికారులకు ఇవ్వవద్దని కోర్టుని కోరామని , హైకోర్టు లో రిట్ పిటీషన్ విచారణ జరిగే వరకు సీల్డ్ కవర్ లో షర్ట్ ఉంచాలని కోర్ట్ ని కోరినట్లు ఆయన తెలిపారు.