కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ప్రస్తుతం కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.
అలాగే స్వామివారి ఉచిత దర్శనానికి 14గంటల సమయం పడుతోంది.
అలాగే టైంస్లాట్, సర్వదర్శనానికి 3గంటల సమయం పడుతోంది.
నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతుండగా
ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 3గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.