“Run for Unity” at Rk Beach in Visakhapatnam,Vizag Vision..విశాఖ ఆర్కే బీచ్ లో సర్దార్ పటేల్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.దేశంలో కలవనన్న మూడు సంస్థానాల్లో జునాగఢ్, హైదరాబాదులను కలిపే బాధ్యతను పటేల్ కు అప్పగించగా, ఆ రెండూ నేడు దేశంలో సమగ్రంగా కలిసిపోయాయని,పటేల్ సేవలు చిరస్మరణీయమని ఎం.పి.హరిబాబు అన్నారు.పటేల్ కు సరైన గుర్తింపు రాలేదని, ఆ లోటు నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహావిష్కరణ ద్వారా తీరిందన్నారు. ఈ దేశాన్ని ఎవరూ ముక్కలు చేయలేరని,అందుకు పటేల్ విగ్రహమే స్ఫూర్తి అన్నారు.