జగన్ పై దాడి కేసులో నిందితుడు తనను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారని చేస్తున్న వ్యాఖ్యలకు అర్ధం లేదన్నారు విశాఖ సీపీ లడ్డా. మేము మా డ్యూటీ చేస్తున్నామని అతను ఇంకా కొన్ని విషయాలను దాచిపెడుతున్నాడన్నారు. పరీక్షించిన డాక్టర్లు అతను ఆరోగ్యంగానే ఉన్నాడని చెబుతుంటే ఉద్దేశ్య పూర్వకంగానే ఆహరం తీసుకోవడం లేదన్నారు. నిందితుడు స్నేహితులు, తోటి పనివాళ్ళు అందరినీ విచారిస్తున్నామని.. అతని బ్యాంకు అకౌంట్ లను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. కిచెన్ లో ఉండాల్సినవాళ్లు బయటకు ఎలా వచ్చారనేది కూడా విచారిస్తున్నామన్నారు.