రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో , గురువారం హత్యాయత్నం జరిగింది. ప్రజాసంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న జగన్ శుక్రవారం హైదరాబాద్ సిబిఐ కోర్టు హాజరు కావాల్సి ఉండటంతో గురువారం విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఇండిగో విమానం హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విమానం కోసం వేచి ఉన్న జగన్ పక్కనే ఉన్న వాష్రూమ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఏర్పోర్ట్ క్యాంటీన్ లో పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తి 160 సీట్లు వస్తాయి సార్ అడ్డు పలకరిస్తూ అని పలకరిస్తూ సెల్ఫీ. తీసుకుంటానని జగన్ కోరాడు . సెల్ఫీ తీసుకుంటూ ఒక్కసారిగా పందెం కోళ్ళకు కట్టే కత్తితో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. కడుపులో పొడవడానికి ప్రయత్నించడంతో జగన్ ఒక్కసారిగా తేరుకొని చేయి అడ్డం పెట్టాడ. దీంతో చేతికి భుజానికి గాయాలయ్యాయి. ఎయిర్ పోర్ట్ లో ప్రధమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జగన్ పై హత్యాయత్నం జరిగింది అని తెలిసి విశాఖ తో పాటు రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉలిక్కి పడ్డాయి. దాడి చేసి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి వెనుక కుట్ర ఉందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో క్యాంటీన్ నిర్వహిస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వారు ఈ దాడి వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం దాడి వెనుక కారణాలు ఇంకా తెలియలేదని చెప్తున్నారు.