This year summer,278 people were killed by thunder and lightning strikes,Vizag Vision..ఈ ఏడాది వేసవికాలంలో ఉరుములు,మెరుపులతో పడిన పిడుగులతో 278 మంది మృత్యువాత పడ్డారు.
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి పిడుగుల ధాటికి 94 మంది మరణించారు.
ఏప్రిల్ నెలలో పిడుగుల వల్ల 55 మంది తుదిశ్వాస విడిచారు.
పిడుగులు పడే ప్రమాదాన్ని గుర్తించి వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ఈ ఏడాది గతంలో కంటే అత్యధికంగా పిడుగుల వల్ల 278 మంది మరణించారని వాతావరణశాఖ వెల్లడించింది.
గత ఏడాది పిడుగుపాటుకు దేశంలో 197 మంది మరణించారు.
2016లో 216 మంది మరణించారు. పిడుగులు పడేటపుడు ప్రజలు ఎత్తైన ప్రదేశాల్లో ఒంటరిగా, పొలాల్లో ఉండవద్దని నిపుణులు కోరారు.
విపరీతమైన ఎండలు, సౌర తుపాను, వాతావరణంలో వేగమైన మార్పుల కారణంగా పెద్ద ఎత్తున పిడుగులు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.