రైలు మార్గం ప్రయాణాలును అరికట్టేందుకు గాను డ్రోన్ కెమెరా తో సర్వే చేపట్టింది కొత్తవలస కిరండల్ కేకే లైన్లో,Vizagvision… మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించే దుకు గాను రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రైలు మార్గం గుండా జరుగుతున్న ప్రయాణాలును అరికట్టేందుకు గాను డ్రోన్ కెమెరా తో సర్వే చేపట్టింది. లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిషేధించిన సంగతి విదితమే. అయితే రైలు మార్గం గుండా రాష్ట్ర, అంతర్ రాష్ట్రా లకు చెందిన ప్రజలు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో రైల్వే శాఖ డ్రోన్ కెమెరా లతో సర్వే చేపట్టి లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు పరిచేందుకు చర్యలు చేపట్టింది. దీని లో బాగం గా బుధవారం రైల్వే సీనియర్ డి.ఎస్.పి జితేంద్ర శ్రీవాస్తవ్,ఐజి రాజారాం ఆదేశాల మేరకు అరకులోయ ఆర్పిఎఫ్ పోలీసులు అరకు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో డ్రోన్ కెమెరాతో సర్వే నిర్వహించింది. దీని వలన రైల్వే మార్గం గుండా ప్రయాణం అరికట్టవచ్చునని,రైల్వే ఆస్తులను గుర్తించవచ్చని అరకు రైల్వే స్టేషన్ సిఐ సిహెచ్ రామకృష్ణ విలేకరులకు తెలిపారు.
















