Titli Cyclone Victims Helping by Sri Sathya Sai Seva Sangam Visakhapatnam,Vizag Vision…
తిత్లీ తుఫాను బాధితులకు శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆపన్న హస్తం”
ఇటీవల తిత్లీ భయంకర తుఫానుకు అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతాల్లో శ్రీకాకుళం శ్రీ సత్య సాయి సేవా సంస్థలకు చెందిన సీనియర్ పదాధికారులు స్వయంగా పర్యటించి, పరిశీలించి బాగా దెబ్బ తిన్న కుటుంబాలను ఇంటింటికీ వెళ్లి పరామర్శించారు.
అటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్య సాయి సేవా సంస్థల తరఫున “సాయి సహాయ్” అన్న కిట్స్ ను విశాఖపట్నం ఎం వి పి కాలనీ లోని ప్రేమ సదన్ మందిరం అందు కిట్స్(సెట్ లాగ) ప్యాక్ చేసిన అనంతరం ఈ రోజు విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షులు వి ఆర్ నాగేశ్వర రావు, జిల్లా పురుష, మహిళల సేవా విభాగం సమన్వయకర్తలు డి రాఘవ రావు, శ్రీమతి అమ్మాజీ, సిటీ సేవా సమితి కన్వీనర్ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు, జిల్లా దీన జనాదరణ పధకం ఇంచార్జి అడ్వకేట్ సత్యనారాయణ, బాల వికాస్ విద్యార్థులు, యువత ప్యాక్ చేసిన అనంతరం, విశ్వ మానవ కళ్యాణం కొరకు సాయి గాయత్రీ మంత్రం జపించి, పూజ చేసి వన్ లో శ్రీ కాకుళం జిల్లా కు పంపించారు.