ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ తెరలేపడంతో మిగిలిన పక్షాలు ఎన్నికల దిశగా పరుగులు పెడుతున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్ పక్షాలు కలిసి పోటీచేయాలని ముందస్తు అవగాహనకు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఏఏ స్థానాలకు పంచుకోవాలి అనే అంశంపై ఇరు పార్టీల పెద్దల మధ్య చర్చలు మొదల య్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5స్థానాలకు టీడీపీ పట్టు పడుతోంది. తమకు బలంగా ఉన్న ప్రస్తుతం నాయకులు పనిచేసుకుంటున్న కోదాడ, ఆలేరు, నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ స్థానాలు తమకు కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసిన బొల్లం మల్ల య్యయాదవ్ 70వేలకు పైగా గణనీయమైన ఓట్లు సాధించడం, సెటిలర్స్ ఓట్లు పెద్దసంఖ్యలో ఉండడంతో ఈ సీట్లను డిమాండ్ చేస్తున్నారు. నకిరేకల్లో టీడీపీ పక్షాన గత ఎన్నికల్లో పోటీ చేసిన సత్తయ్యగౌడ్ ఒకసారి సుమారు 4వేల ఓట్ల తేడాతో, మరోసారి 3వేల ఓట్ల తేడాతో ఓ టమి పాలయ్యారు. నల్లగొండ నియోజకవర్గం జిల్లా కేంద్రం, ఇక్కడి నుంచి టీడీపీ పోటీచేస్తే జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు మానసిక స్థైర్యం ఉంటుందని, గతంలో దివంగత సీఎం ఎన్టీఆర్ పోటీచేసి భారీ మెజారిటీ సాధించారని, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై పోటీచేసిన గుత్తా సుఖేందర్రెడ్డి టీడీపీ అభ్యర్థిగా రెండోస్థానంలో నిలిచారని, ఎస్సీలు, మైనార్టీలు, బీసీలు బలంగా ఉన్న ఈ స్థానం బీసీ అభ్యర్థి పనిచేసుకుంటున్నందున ఈ స్థా నాన్ని ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. పొత్తుల్లో భాగంగా ఒకసారి సీపీఎం, మరోసారి బీజేపీకి వదిలామని, 20ఏళ్లుగా ఎమ్మెల్యే వెంకట్రెడ్డి ఉన్నారని, సుదీర్ఘ కాలం ఉండడంతో ఆయనపై వ్యతిరేకత ఉందని, దాన్ని అధిగమిస్తూ మిత్రపక్షాలు గెలుచుకోవాలంటే నల్లగొండ టీడీపీకి కేటాయించడమే పరిష్కారమని ఆ నేతలు ప్రతిపాదిస్తున్నారు. ఇక భువనగిరి నియోజకవర్గానికి వస్తే బండ్రు శోభారాణి ఉద్యమ నాయకురాలని, సుదీర్ఘకాలంగా అక్కడ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉందని, కాంగ్రెస్, సీపీఐకి బలమైన ఓటుబ్యాంకు ఉన్నందున టీడీపీకి కేటాయిస్తే తమకు విజయం ఖాయమని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే 5స్థానాలు డిమాండ్ చేస్తుండగా, చివరకు ఎన్ని కేటాయిస్తారు ? అభ్యర్థులుగా ఎవరు మిగులుతారు ? కాంగ్రెస్, సీపీఐ పక్షాలు మిత్ర ధర్మాన్ని పాటి స్తాయా? స్నేహపూర్వక పోటీకి దిగుతాయా? అన్నది వేచిచూడాల్సిఉంది.