జమ్మూ కశ్మీర్లోని బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఇవాళ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
హాజిన్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.
మృతి చెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
మరికొందరు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు భావిస్తున్న భద్రతా దళాలు… బందిపొరా జిల్లాను జల్లెడపడుతున్నాయి.