Former PM Atal Bihari Vajpayee Passed Away At Age 93,Vizagvision..రతరత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మరణంతో విశాఖ బిజేపి శ్రేణులు విషాదంలో మునిగిపోయారు.బిజేపి పెద్ద దిక్కును కోల్ఫోయామంటు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన దశాబ్ధాలుగా దేశం కోసం జీవించారని,అత్యంత శ్రద్ధాశక్తులతో దేశానికి సేవ చేశారని జిజేపి నేతలు అన్నారు.ఎం.పి హరిబాబు,ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,ఎమ్మెల్సీ మాధవ్ వాజ్ పేయికి నివాళిలు అర్పించారు…
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి(93) ఇకలేరు. తొమ్మిదివారాలుగా ఎయిమ్స్లో మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి.. 9 వారాలుగా ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో మంచానికే పరిమితమయ్యారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్, శ్వాస తీసుకోవడం కష్టం కావడం వంటి సమస్యలతో బాధపడుతున్న వాజ్పేయిని జూన్ 11న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. నాటి నుంచి అక్కడే ఆయన చికిత్స పొందారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్సనందించారు. అయితే ఆయన మూత్రపిండాల్లో ఒకటే పనిచేస్తుండడం, బలహీనమైన ఊపిరితిత్తులు, మధుమేహం కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.