అందరి నోటా..అంబర్పేట
పట్టు నిలుపుకునేందుకు బీజేపీ
పట్టుకోసం టీఆర్ఎస్
పూర్వ వైభవం కోసం కాంగ్రెస్
ఉనికి కోసం టీడీపీ
ఎన్నికలకు సమాయత్తం అవుతున్న పార్టీలు……
ముందస్తు ఎన్నికల ఊహాగానం అంబర్పేట నియోజకవర్గంలోని ప్రధాన రాజకీయ పార్టీల కార్యకలాపాల పోకడలను మార్చి వేసింది. ముఖ్యంగా నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులు ఎవరికి వారు వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. పోటాపోటీగా నియోజకవర్గంలో పాదయాత్రలు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు జరుపుతున్నారు. అదే విధంగా కుల, బస్తీ, మహిళా, కాలనీ, యువజన సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహిస్తూ, మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటితో పాటు ఆషాఢమాసం బోనాల పండగ సందర్భంగా మంచి పనులు చేసి పేరు తెచ్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆలయాల నిర్వాహకుల వద్దకు వెళ్లి బోనాల ఏర్పాట్లకు కావాల్సిన సహకారం అందిస్తున్నారు. అమ్మవారి ఆలయాల వద్ద ప్రధాన చౌరస్తాలలో తమ ప్లెక్సీలను ఏర్పా టు చేయాలని ఆయా ఆలయాల కమిటీలు, బస్తీ సంఘాలకు ముందస్తు చెల్లింపులు కూడా చేస్తున్నారు.
నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో కూడా గెలవాలనే సంకల్పంతో నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రక్రియను ఇప్పటి నుంచే వేగవంతం చేశారు. అయితే, బీజేపీని రాబోయే ఎన్నికల్లో ఓడించి అంబర్పేటలో పాగా వేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
వీహెచ్ యాక్టివ్
కాంగ్రెస్ పార్టీలో అంబర్పేట నియోజకవర్గానికి పెద్దదిక్కైన మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ పటిష్ఠతపై దృష్టి కేంద్రీకరించారు. పాలక పక్షాలపై వ్యతిరేకత ఉంటుందనే అంచనాతో, ఆ నెగెటివ్ ఓటింగ్ను తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహరచనలో ఆయన ఉన్నారు.
టీడీపీ పరిస్థితి అంతంతే..
రాష్ట్ర విభజన అనంతరం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులందరూ టీ ఆర్ఎస్, ఇతర పార్టీలలోకి వెళ్లిన తర్వాత పార్టీ పరిస్థితి అంతంత మా త్రంగా ఉంది. నియోజకవర్గానికి చెం దిన మాజీ కార్పొరేటర్, టీడీపీ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి వనం రమేష్ మాత్రం పార్టీని వదలకుండా నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోని తెలంగాణ జన సమితి, బీఎల్ఎఫ్, సీపీఐ, సీపీఎంలు ఉనికిచాటుకుని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని కార్య్రకమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో అంబర్పేట నియోజకవర్గంలో రాజకీయం వేడేక్కింది.
విజయమే లక్ష్యంగా కిషన్రెడ్డి
అంబర్పేట నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలుగా వరుసగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో కూడా తన గెలుపును పదిలం చేసుకోవడం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఎన్నికలు ముందస్తుగా డిసెంబర్లోపు వచ్చినా లేదా ఏప్రిల్లో వచ్చినా బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆయన సంకేతాలు ఇచ్చారు. గత కొద్ది రోజులుగా డివిజన్ల వారిగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచనలు చేశారు. డివిజన్లలోని అన్ని పోలింగ్ బూత్లకు పార్టీ కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. అన్ని అనుంబంధ సంస్థలను యాక్టివ్ పాత్ర పోషించేలా చూడాలని డివిజన్ అధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులకు ఆయా డివిజన్లలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు జరుగుతున్న తీరు, ప్రజలకు పార్టీ పట్ల ఉన్న అభిప్రాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు.
అంతే కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో తన పనితీరు, బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయం, మోదీ పాలన తదితర అంశాలపై ఆయన వ్యక్తిగత సర్వేలు కూడా చేయించుకున్నట్లు తెలిసింది. సర్వేలో తనకు వ్యతిరేకంగా వచ్చిన అంశాలను పరిశీలించి సవరించుకుంటున్నట్లు తెలిసింది. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, తాను ఎంపీగా చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎవరికి అవకాశం కల్పించాలనే అంశాలపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు అతని అనుచరులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై కాంగ్రెస్ ఆశ
సొంత నియోజకవర్గం అయిన అంబర్పేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రయత్నాలు చేస్తున్నారు. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిన వీహెచ్ ఈ సారి మాత్రం గెలిచి తన సత్తాచాటాలని ముందస్తు ప్రయత్నాలు చే పట్టారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీశ్రేణులకు సూచిస్తున్నారు. ప్రజా సమస్యల పట్ల పార్టీశ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని వీహెచ్ సూచిస్తున్నారు. తనకు ఉన్న పాత పరిచ
నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో కూడా గెలవాలనే సంకల్పంతో నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రక్రియను ఇప్పటి నుంచే వేగవంతం చేశారు. అయితే, బీజేపీని రాబోయే ఎన్నికల్లో ఓడించి అంబర్పేటలో పాగా వేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
వీహెచ్ యాక్టివ్
కాంగ్రెస్ పార్టీలో అంబర్పేట నియోజకవర్గానికి పెద్దదిక్కైన మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ పటిష్ఠతపై దృష్టి కేంద్రీకరించారు. పాలక పక్షాలపై వ్యతిరేకత ఉంటుందనే అంచనాతో, ఆ నెగెటివ్ ఓటింగ్ను తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహరచనలో ఆయన ఉన్నారు.
టీడీపీ పరిస్థితి అంతంతే..
రాష్ట్ర విభజన అనంతరం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులందరూ టీ ఆర్ఎస్, ఇతర పార్టీలలోకి వెళ్లిన తర్వాత పార్టీ పరిస్థితి అంతంత మా త్రంగా ఉంది. నియోజకవర్గానికి చెం దిన మాజీ కార్పొరేటర్, టీడీపీ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి వనం రమేష్ మాత్రం పార్టీని వదలకుండా నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోని తెలంగాణ జన సమితి, బీఎల్ఎఫ్, సీపీఐ, సీపీఎంలు ఉనికిచాటుకుని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని కార్య్రకమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో అంబర్పేట నియోజకవర్గంలో రాజకీయం వేడేక్కింది.
విజయమే లక్ష్యంగా కిషన్రెడ్డి
అంబర్పేట నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలుగా వరుసగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో కూడా తన గెలుపును పదిలం చేసుకోవడం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఎన్నికలు ముందస్తుగా డిసెంబర్లోపు వచ్చినా లేదా ఏప్రిల్లో వచ్చినా బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆయన సంకేతాలు ఇచ్చారు. గత కొద్ది రోజులుగా డివిజన్ల వారిగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచనలు చేశారు. డివిజన్లలోని అన్ని పోలింగ్ బూత్లకు పార్టీ కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. అన్ని అనుంబంధ సంస్థలను యాక్టివ్ పాత్ర పోషించేలా చూడాలని డివిజన్ అధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులకు ఆయా డివిజన్లలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు జరుగుతున్న తీరు, ప్రజలకు పార్టీ పట్ల ఉన్న అభిప్రాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు.
అంతే కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో తన పనితీరు, బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయం, మోదీ పాలన తదితర అంశాలపై ఆయన వ్యక్తిగత సర్వేలు కూడా చేయించుకున్నట్లు తెలిసింది. సర్వేలో తనకు వ్యతిరేకంగా వచ్చిన అంశాలను పరిశీలించి సవరించుకుంటున్నట్లు తెలిసింది. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, తాను ఎంపీగా చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎవరికి అవకాశం కల్పించాలనే అంశాలపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు అతని అనుచరులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై కాంగ్రెస్ ఆశ
సొంత నియోజకవర్గం అయిన అంబర్పేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రయత్నాలు చేస్తున్నారు. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిన వీహెచ్ ఈ సారి మాత్రం గెలిచి తన సత్తాచాటాలని ముందస్తు ప్రయత్నాలు చే పట్టారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీశ్రేణులకు సూచిస్తున్నారు. ప్రజా సమస్యల పట్ల పార్టీశ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని వీహెచ్ సూచిస్తున్నారు. తనకు ఉన్న పాత పరిచ
యాలను కదిలించి ఎన్నికల సన్నాహాల దిశగా యాక్టివ్ చేస్తున్నారు.
సత్తాను చాటేందుకు టీడీపీ ప్రయత్నాలు
అంబర్పేట నియోజకవర్గంలో టీడీపీకి బలమైన పట్టు ఉంది. గతంలో టీడీపీ తరఫున సి.కృష్ణాయాదవ్ రెండుమార్లు గెలిచారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి చెందిన నాయకులు అధికార పార్టీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ పటిష్ఠత కోసం మాజీ కార్పొరేటర్, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి అయిన వనం రమేష్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా టీడీపీ ఉనికి చాటడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలను నిర్వహిస్తూ టీడీపీ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయన్నది ప్రశ్నర్థకమే.
జెండా ఎగురేసేందుకు టీఆర్ఎస్ యత్నాలు
అంబర్పేట నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్రెడ్డి రెండవ స్థానంలో నిలిచారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం నియోజకవర్గంలోపార్టీ బలంగా ఉందని, గెలుపు ఖాయమని భావిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ టికెట్ను నియోజకవర్గం ఇన్చార్జి ఎడ్ల సుధాకర్రెడ్డితోపాటు మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్, ఓ కార్పొరేటర్ భర్త కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. నియోజవకర్గంలోని ఇన్చార్జికి, కార్పొరేటర్లకు మధ్య సఖ్యత లేదు. కార్పొరేటర్ల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడంపై అధిష్ఠానం దృష్టి పెట్టకపోవడం పట్ల పార్టీశ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అధిష్ఠానం మాత్రం సర్వేల ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉంటే వారికి ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం.
సత్తాను చాటేందుకు టీడీపీ ప్రయత్నాలు
అంబర్పేట నియోజకవర్గంలో టీడీపీకి బలమైన పట్టు ఉంది. గతంలో టీడీపీ తరఫున సి.కృష్ణాయాదవ్ రెండుమార్లు గెలిచారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి చెందిన నాయకులు అధికార పార్టీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ పటిష్ఠత కోసం మాజీ కార్పొరేటర్, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి అయిన వనం రమేష్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా టీడీపీ ఉనికి చాటడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలను నిర్వహిస్తూ టీడీపీ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయన్నది ప్రశ్నర్థకమే.
జెండా ఎగురేసేందుకు టీఆర్ఎస్ యత్నాలు
అంబర్పేట నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్రెడ్డి రెండవ స్థానంలో నిలిచారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం నియోజకవర్గంలోపార్టీ బలంగా ఉందని, గెలుపు ఖాయమని భావిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ టికెట్ను నియోజకవర్గం ఇన్చార్జి ఎడ్ల సుధాకర్రెడ్డితోపాటు మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్, ఓ కార్పొరేటర్ భర్త కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. నియోజవకర్గంలోని ఇన్చార్జికి, కార్పొరేటర్లకు మధ్య సఖ్యత లేదు. కార్పొరేటర్ల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడంపై అధిష్ఠానం దృష్టి పెట్టకపోవడం పట్ల పార్టీశ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అధిష్ఠానం మాత్రం సర్వేల ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉంటే వారికి ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం.