Law students for justice were Sickన్యాయం కోసం న్యాయ విద్యార్థులు రోడ్డెక్కారు Sabbavaram,Vizag Vision..న్యాయం కోసం న్యాయ విద్యార్థులు రోడ్డెక్కారు
వివిధ సెమిస్టర్లలో తప్పిన 81 మంది విద్యార్థులను విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం బయటకు పంపించేసింది. అయితే తమకు మరో అవకాశం ఇవ్వడంతోపాటు లోపలికి అనుమతించాలని కోరుతూ 81విద్యార్థులు, వారి మద్దతుదారులు వర్సిటీ గేటు బయట వర్షంలో మౌన దీక్షకు దిగారు. తమను అనుమతించకపోతే ఇక్కడే ఉంటామని భీష్మించారు. 78మంది నాలుగు సార్లు పరీక్షల్లో విఫలం కావడంతో ఛాన్సలర్ ఆదేశాల మేరకు వారి హస్టల్ కుడా లేకుండా బయటకు పంపించి వేసారు..కనీసం మహిళ విద్యార్థులు ను వాష్ రుములకు కుడా పంపడంలేదని మహిళ విద్యార్థులు వాపోతున్నారు..దేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు ఎక్కడ కి వెళ్ళాలని ప్రశ్నిస్తున్నారు.