విశాఖ జిల్లా. పరవాడ మండలం తాడి గ్రామ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలించాలి అంటూ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కాలుష్యానికి ప్రజలు పడే ఇబ్బందులను ప్రజలు పవన్ కు విన్నవించుకున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ త్వరలో జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని త్వరలో నాయకులు తాడి గ్రామాని వచ్చి ప్రతి ఒక్కరి సమష్యను తెలుసుకోని జనసేన మీకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.