ఉత్తరాఖండ్లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
పౌరీ-ఘడ్వాల్ జిల్లాలోని పిపాలి-బౌనా జాతీయ రహదారిపై నానిదాడా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఘటనాస్థలం నుంచి 20 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీసినట్లు తెలుస్తోంది.
గాయపడ్డ మరికొందరిని ఆస్పత్రికి తరలించారు.
ఘటనకు సంబంధించి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
చెన్నై: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిజ్రాకు బార్ కౌన్సిల్లో సభ్యత్వం లభించింది. 36 ఏళ్ల సత్యశ్రీ
శనివారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో చెన్నైలోని తమిళనాడు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో తన పేరును నమోదు చేసుకున్నారు.
న్యాయశాస్త్రంలో
పట్టా పుచ్చుకున్న 11 ఏళ్ల తర్వాత బార్ కౌన్సిల్లో సభ్యత్వం పొందగలిగానని ఈ సందర్భంగా
సత్య శ్రీ ఆవేదన చెందారు.
జడ్జిగా ఎదగడమే తన కల అని చెప్పారు.
రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన
సత్యశ్రీ జన్మతః బాలుడు. చిన్నప్పుడే శరీరంలో స్త్రీగా మార్పులు ప్రారంభమవడంతో కుటుంబాన్ని వదిలి వచ్చి చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టులో పెరిగారు.