భారీ వర్షాలతో అమర్నాథ్ యాత్రకు ఆటంకం ఏర్పడింది. బాలటాల్, పహల్ గామ్ మార్గాల్లో యాత్ర నిలిచిపోయింది. వాహనాలను, యాత్రికులను అధికారులు నిలిపివేశారు. మరో 48 గంటల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు అమర్నాథ్ యాత్రకు ఉగ్రవాద ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో భారీ భద్రత కల్పించింది ప్రభుత్వం. 25వేల మంది కేంద్ర పారామిలటరీ సిబ్బంది, 15వేల మంది జమ్ముకశ్మీర్ సిబ్బందితో పహారా కాస్తున్నారు. భద్రతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తొలి బ్యాచ్ యాత్రికుల్లో మొత్తం 1904 మంది ఉండగా… వీరిలో 330మంది మహిళలు, 30మంది చిన్నారులు ఉన్నారు.