యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు,..
బాబాల గురించి యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము దేవుళ్లమని ప్రకటించుకున్న బాబాలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వారిని ఉరి తీయాలని రాందేవ్ వ్యాఖ్యానించారు. బాబాల పేరిట అక్రమాలకు పాల్పడుతున్న వారిని ప్రస్థుతం జైలుకు పంపిస్తున్నారని కాని వారిని ఉరితీసి చంపాలని సూచించారు. కోట నగరంలో జరిగిన మీడియా సమావేశంలో రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు ధరిస్తేనే బాబాలు కాలేరని, వారి ప్రవర్తనను బట్టి బాబాలు అవుతారని ఆయన చెప్పారు. దేవుడిగా ప్రకటించుకున్న ధాతి మహరాజ్ శనిథామ్ ఆశ్రమంలో అమ్మాయిలపై అత్యాచారం చేశాడని వచ్చిన వార్తలపై స్పందించిన బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.