ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. సుమారు గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ 10 అంశాలపై ప్రధానికి లేఖ ఇచ్చారు. ఇందులో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని.. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని.. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని విన్నవించారు. అలాగే.. సచివాలయం కోసం బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వాలని.. తెలంగాణకు ఐఐఎం, ఐటీఐఆర్ను ఇవ్వాలని. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలకు నవోదయ స్కూళ్లు మంజూరు చేయాలని.. కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించాలని కోరారు. ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.