ప్రధాని మోదీ కాంగ్రెస్ను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు రాష్ట్రపతికి మన్మోహన్ ఒక లేఖ రాశారు. ‘కాంగ్రెస్ నేతలు చెవులు పెద్దవిగా చేసుకుని నా మాటలు వినండి. మీరు హద్దులు దాటితే, నేను మోదీని, మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది’ అని మోదీ బెదిరించినట్టు మన్మోహన్ తన లేఖలో పేర్కొన్నారు. మోదీ మాటలు అవమానపరచేలా ఉండటమే కాక, శాంతికి విఘాతం కలిగిస్తూ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆయన రాసిన లేఖపై పార్లమెంటు ఉభయసభల విపక్ష నేతలు, కాంగ్రెస్ సీనియర్ నేతలైన పి.చిదంబరం, అశోక్ గెహ్లాట్, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, మోతీలాల్ వోరా, కమల్నాథ్, అహ్మద్ పటేల్ తదితరులు సంతకాలు చేశారు.