HomeUncategorizedVisakhapatnam Vizagvision: క్రీడ ప్రాంగణం, కళావాణి ఆడిటోరియం స్వాధీనం చేసుకున్న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ*సాలిగ్రామపురంలో ఉన్న నెహ్రూ క్రీడా మరియూ సాంస్కృతిక సముదాయంలోని క్రీడా సముదాయం మరియు కలావాణి ఏ/సి ఆడిటోరియంపై ఉన్న లీజు ఒప్పందాలను రద్దు చేసిన నేపథ్యంలో, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 15.12.2025 సోమవారం తిరిగి స్వాధీనం చేసుకుంది .క్రీడా సముదాయం గతంలో ఎం/ఎస్ విశ్వనాథ్ స్పోర్ట్స్ & కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు, కలావాణి ఏ/సి ఆడిటోరియం ఎం/ఎస్ విశ్వనాథ్ అవెన్యూస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు లీజుకు ఇచ్చియున్నారు. సంబంధిత లీజు ఒప్పందాల్లో పేర్కొన్న నిబంధనలు, షరతులు పాటించకపోవడంతో, లీజు ఒప్పంద నిబంధనల ప్రకారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 11.09.2025 న లీజు రద్దు నోటీసులను జారీ చేసింది.లీజు రద్దు నోటీసుల జారీ అనంతరం అవసరమైన ప్రక్రియ పూర్తయిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అధికారుల సమక్షంలో 15.12.2025 న విశాఖపట్నం పోర్ట్ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియ అంతా సక్రమంగా, చట్ట ప్రకారం నిర్వహించినారు. ప్రస్తుతం పోర్ట్ స్టేడియం అంతా తిరిగి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధీనంలోకి వచ్చాయి.పోర్ట్ మరియు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పోర్ట్ నియమ నిబంధనలకు అనుగుణంగా, ఆస్తుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ సౌకర్యాల భవిష్యత్తు వినియోగంపై విశాఖపట్నం పోర్ట్ అథారిటీ పరిశీలన చేయనుంది.జారీ చేసిన వారు:విశాఖపట్నం పోర్ట్ అథారిటీ********
Visakhapatnam Vizagvision: క్రీడ ప్రాంగణం, కళావాణి ఆడిటోరియం స్వాధీనం చేసుకున్న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ*సాలిగ్రామపురంలో ఉన్న నెహ్రూ క్రీడా మరియూ సాంస్కృతిక సముదాయంలోని క్రీడా సముదాయం మరియు కలావాణి ఏ/సి ఆడిటోరియంపై ఉన్న లీజు ఒప్పందాలను రద్దు చేసిన నేపథ్యంలో, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 15.12.2025 సోమవారం తిరిగి స్వాధీనం చేసుకుంది .క్రీడా సముదాయం గతంలో ఎం/ఎస్ విశ్వనాథ్ స్పోర్ట్స్ & కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు, కలావాణి ఏ/సి ఆడిటోరియం ఎం/ఎస్ విశ్వనాథ్ అవెన్యూస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు లీజుకు ఇచ్చియున్నారు. సంబంధిత లీజు ఒప్పందాల్లో పేర్కొన్న నిబంధనలు, షరతులు పాటించకపోవడంతో, లీజు ఒప్పంద నిబంధనల ప్రకారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 11.09.2025 న లీజు రద్దు నోటీసులను జారీ చేసింది.లీజు రద్దు నోటీసుల జారీ అనంతరం అవసరమైన ప్రక్రియ పూర్తయిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అధికారుల సమక్షంలో 15.12.2025 న విశాఖపట్నం పోర్ట్ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియ అంతా సక్రమంగా, చట్ట ప్రకారం నిర్వహించినారు. ప్రస్తుతం పోర్ట్ స్టేడియం అంతా తిరిగి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధీనంలోకి వచ్చాయి.పోర్ట్ మరియు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పోర్ట్ నియమ నిబంధనలకు అనుగుణంగా, ఆస్తుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ సౌకర్యాల భవిష్యత్తు వినియోగంపై విశాఖపట్నం పోర్ట్ అథారిటీ పరిశీలన చేయనుంది.జారీ చేసిన వారు:విశాఖపట్నం పోర్ట్ అథారిటీ********