HomeUncategorizedVisakhapatnam Vizagvision: రౌండ్ టేబుల్ ఇండియా దేశ నిర్మాణానికి కట్టుబడిన యువ నిపుణులు,యువ వ్యాపారవేత్తలతో కూడిన సేవా సంస్థ అని రౌండ్ టేబుల్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రచిత్ బన్సల్ తెలిపారు.శుక్రవారం విశాఖపట్నం దసపల్లా హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9 చైర్మన్ కౌషిక్ ఎక్కాల,సభ్యులు రోహిత్ బజాజ్, సీతారామరాజు దంతులూరి, అబిక్ హిరావత్, వికాస్ భారతి, భువన్ గొట్టిపాటి, అరవింద్ గొల్లు,రవితేజ, లఖన్ ఇద్నానీ లతో కలిసి రచిత్ బన్సల్ మాట్లాడుతూ 1962 లో ప్రారంభించిన రౌండ్ టేబుల్ సంస్థ విద్య,ఆరోగ్యం, సమాజ అభివృద్ధిలో భాగమైన సంస్థ అని,తమ మా నమూనా ప్రత్యేకమైనదని, డిజైన్ నుండి డెలివరీ వరకు భాగస్వాములతో కలిసి క్షేత్రస్థాయిలో నిజమైన అవసరాలను తీర్చేలా చూస్తామన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా దేశంలోని ప్రముఖ రాజకీయేతర, మతేతర మరియు లాభాపేక్షలేని సంస్థలలో ఒకటిగా పేరొందిందని,దేశవ్యాప్తంగా తాము చేస్తున్న సామజిక సేవా కార్యకలాపాలు వివరించడానికి మీడియా సమావేశం పెట్టామన్నారు.విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు సమాజ సేవా రంగాలలో ఆర్ టీ ఐ ద్వారా జరగుతున్న ప్రధాన కార్యక్రమాలు వివరించారు. పేద పిల్లలకు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. సహాయాన్ని అందించడంపై దృష్టి సారించే ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టుల ద్వారా సమాజంలో పేదపిల్లలకు,ఆర్ టీ ఐ నిబద్ధత గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడం తమ లక్ష్యం అని రచిత్ బన్సల్ తెలిపారు.సమాజ సేవా రంగంలో సంస్థ దార్శనికత, ఇటీవలి తాము సాదించిన విజయాలు, భవిష్యత్తు ప్రణాళికల ను వివరించారు.రౌండ్ టేబుల్ ఇండియా అనేక దశాబ్దాలుగా సామాజిక ప్రభావ కార్యక్రమాలలో ముందంజలో ఉందని దేశవ్యాప్తంగా యువ నిపుణులు మరియు వ్యవస్థాపకుల క్రియాశీల భాగస్వామ్యంతో.సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి అనేక మంది యువ భాగస్వామ్యులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
Visakhapatnam Vizagvision: రౌండ్ టేబుల్ ఇండియా దేశ నిర్మాణానికి కట్టుబడిన యువ నిపుణులు,యువ వ్యాపారవేత్తలతో కూడిన సేవా సంస్థ అని రౌండ్ టేబుల్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రచిత్ బన్సల్ తెలిపారు.శుక్రవారం విశాఖపట్నం దసపల్లా హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9 చైర్మన్ కౌషిక్ ఎక్కాల,సభ్యులు రోహిత్ బజాజ్, సీతారామరాజు దంతులూరి, అబిక్ హిరావత్, వికాస్ భారతి, భువన్ గొట్టిపాటి, అరవింద్ గొల్లు,రవితేజ, లఖన్ ఇద్నానీ లతో కలిసి రచిత్ బన్సల్ మాట్లాడుతూ 1962 లో ప్రారంభించిన రౌండ్ టేబుల్ సంస్థ విద్య,ఆరోగ్యం, సమాజ అభివృద్ధిలో భాగమైన సంస్థ అని,తమ మా నమూనా ప్రత్యేకమైనదని, డిజైన్ నుండి డెలివరీ వరకు భాగస్వాములతో కలిసి క్షేత్రస్థాయిలో నిజమైన అవసరాలను తీర్చేలా చూస్తామన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా దేశంలోని ప్రముఖ రాజకీయేతర, మతేతర మరియు లాభాపేక్షలేని సంస్థలలో ఒకటిగా పేరొందిందని,దేశవ్యాప్తంగా తాము చేస్తున్న సామజిక సేవా కార్యకలాపాలు వివరించడానికి మీడియా సమావేశం పెట్టామన్నారు.విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు సమాజ సేవా రంగాలలో ఆర్ టీ ఐ ద్వారా జరగుతున్న ప్రధాన కార్యక్రమాలు వివరించారు. పేద పిల్లలకు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. సహాయాన్ని అందించడంపై దృష్టి సారించే ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టుల ద్వారా సమాజంలో పేదపిల్లలకు,ఆర్ టీ ఐ నిబద్ధత గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడం తమ లక్ష్యం అని రచిత్ బన్సల్ తెలిపారు.సమాజ సేవా రంగంలో సంస్థ దార్శనికత, ఇటీవలి తాము సాదించిన విజయాలు, భవిష్యత్తు ప్రణాళికల ను వివరించారు.రౌండ్ టేబుల్ ఇండియా అనేక దశాబ్దాలుగా సామాజిక ప్రభావ కార్యక్రమాలలో ముందంజలో ఉందని దేశవ్యాప్తంగా యువ నిపుణులు మరియు వ్యవస్థాపకుల క్రియాశీల భాగస్వామ్యంతో.సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి అనేక మంది యువ భాగస్వామ్యులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.