HomeUncategorizedVisakhapatnam Vizag vision: పోర్ట్స్ కాన్క్లేవ్ రెండవ రోజు – ప్రాంతీయ వాణిజ్యం, క్రూయిజ్ టూరిజం మరియు నౌకాశ్రయ రంగ అభివృద్ధిపై చర్చ-విశాఖపట్నంలోని హోటల్ నోవోటెల్ లో నిర్వహించిన బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్ రెండవ రోజు, బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ప్రాంతీయ నౌకాశ్రయ సహకారం, పోర్ట్ సామర్థ్యం, క్రూయిజ్ పర్యటనల అభివృద్ధి మరియు మానవ వనరుల ప్రగతిపై ప్రధానంగా చర్చ సాగింది.వివిధ రంగాల నుంచి వచ్చిన నిపుణులు మోడరేటర్లుగా వ్యవహరించి కీలక అంశాలపై తమ అవగాహనను పంచుకోగా, ఆయా రంగాల నుండి వచ్చిన ప్రముఖ వక్తలు కూడా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారు .రెండో రోజు ప్రారంభమైన తొలి ప్యానెల్ చర్చలో ప్రాంతీయ అంతర్ వాణిజ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఇది కేవలం 7% వద్దే ఉంది. కస్టమ్స్ విధానాలను సరళీకృతం చేయడం, నియంత్రణ సంబంధిత అవరోధాలను తొలగించడం, మరియు లాజిస్టిక్ మౌలిక సదుపాయాల్లో ఉన్న లోటులను అధిగమించడం వంటి అంశాలపై చర్చ జరిగింది.తదుపరి సెషన్లో బిమ్స్టెక్ ప్రాంతంలో క్రూయిజ్ టూరిజం విస్తృతమైన అవకాశాలపై చర్చించారు. సముద్రతీరాల జీవవైవిధ్యం, సంపన్న సాంస్కృతిక వారసత్వం మరియు పర్యాటక ఆధ్యాత్మిక మార్గాలు వంటి అంశాల ఆధారంగా, క్రూయిజ్ మార్గాలు, ఈకోటూరిజం, హెరిటేజ్ ట్రైల్స్ అభివృద్ధిపై పలు దిశానిర్దేశకమైన ప్రతిపాదనలు వ్యక్తమయ్యాయి. బిమ్స్టెక్ నౌకాశ్రయాల మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం పై చర్చ సాగింది. గతంలో చర్చల మూలాంశాల ఆధారంగా సుదీర్ఘకాలికంగా ఆచరణలో పెట్టగల అభివృద్ధి లక్ష్యాలను, ఆవశ్యకమైన సరైన మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు.టెక్నికల్ సెషన్లో నౌకాశ్రయ రంగ కార్మికులకు నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించారు. షిప్యార్డులు మరియు పోర్టు అభివృద్ధిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల పాత్రపై చర్చలు జరిగాయి. భవిష్యత్తులో పోర్ట్ రంగాన్ని ముందుకు నడిపించే యువశక్తిని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ సెషన్ కొనసాగింది.పోర్ట్ నౌక మరియు జలరావణ శాఖా మంత్రి శ్రీసర్బానంద సోనోవాల్ హిందుస్తాన్ షిప్యార్డును సందర్శించారు. తదనంతరం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్టు చైర్పర్సన్ డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్ గారు కూడా పాల్గొన్నారు.మినిస్ట్రీస్ ఆఫ్ మారిటైమ్ సెక్యూరిటీ మరియు విదేశీ వ్యవహారాల అధికారుల సమక్షంలో ముగింపు ప్రసంగాలు సాగాయి. అనంతరం శ్రీ దుర్గేశ్ కుమార్ దుబే గారు, డిప్యూటీ ఛైర్మన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, ముగింపు ప్రసంగంతో రెండు రోజుల బీమ్స్ టెక్ సదస్సు విజయవంతంగా ముగిసింది.
Visakhapatnam Vizag vision: పోర్ట్స్ కాన్క్లేవ్ రెండవ రోజు – ప్రాంతీయ వాణిజ్యం, క్రూయిజ్ టూరిజం మరియు నౌకాశ్రయ రంగ అభివృద్ధిపై చర్చ-విశాఖపట్నంలోని హోటల్ నోవోటెల్ లో నిర్వహించిన బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్ రెండవ రోజు, బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ప్రాంతీయ నౌకాశ్రయ సహకారం, పోర్ట్ సామర్థ్యం, క్రూయిజ్ పర్యటనల అభివృద్ధి మరియు మానవ వనరుల ప్రగతిపై ప్రధానంగా చర్చ సాగింది.వివిధ రంగాల నుంచి వచ్చిన నిపుణులు మోడరేటర్లుగా వ్యవహరించి కీలక అంశాలపై తమ అవగాహనను పంచుకోగా, ఆయా రంగాల నుండి వచ్చిన ప్రముఖ వక్తలు కూడా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారు .రెండో రోజు ప్రారంభమైన తొలి ప్యానెల్ చర్చలో ప్రాంతీయ అంతర్ వాణిజ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఇది కేవలం 7% వద్దే ఉంది. కస్టమ్స్ విధానాలను సరళీకృతం చేయడం, నియంత్రణ సంబంధిత అవరోధాలను తొలగించడం, మరియు లాజిస్టిక్ మౌలిక సదుపాయాల్లో ఉన్న లోటులను అధిగమించడం వంటి అంశాలపై చర్చ జరిగింది.తదుపరి సెషన్లో బిమ్స్టెక్ ప్రాంతంలో క్రూయిజ్ టూరిజం విస్తృతమైన అవకాశాలపై చర్చించారు. సముద్రతీరాల జీవవైవిధ్యం, సంపన్న సాంస్కృతిక వారసత్వం మరియు పర్యాటక ఆధ్యాత్మిక మార్గాలు వంటి అంశాల ఆధారంగా, క్రూయిజ్ మార్గాలు, ఈకోటూరిజం, హెరిటేజ్ ట్రైల్స్ అభివృద్ధిపై పలు దిశానిర్దేశకమైన ప్రతిపాదనలు వ్యక్తమయ్యాయి. బిమ్స్టెక్ నౌకాశ్రయాల మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం పై చర్చ సాగింది. గతంలో చర్చల మూలాంశాల ఆధారంగా సుదీర్ఘకాలికంగా ఆచరణలో పెట్టగల అభివృద్ధి లక్ష్యాలను, ఆవశ్యకమైన సరైన మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు.టెక్నికల్ సెషన్లో నౌకాశ్రయ రంగ కార్మికులకు నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించారు. షిప్యార్డులు మరియు పోర్టు అభివృద్ధిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల పాత్రపై చర్చలు జరిగాయి. భవిష్యత్తులో పోర్ట్ రంగాన్ని ముందుకు నడిపించే యువశక్తిని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ సెషన్ కొనసాగింది.పోర్ట్ నౌక మరియు జలరావణ శాఖా మంత్రి శ్రీసర్బానంద సోనోవాల్ హిందుస్తాన్ షిప్యార్డును సందర్శించారు. తదనంతరం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్టు చైర్పర్సన్ డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్ గారు కూడా పాల్గొన్నారు.మినిస్ట్రీస్ ఆఫ్ మారిటైమ్ సెక్యూరిటీ మరియు విదేశీ వ్యవహారాల అధికారుల సమక్షంలో ముగింపు ప్రసంగాలు సాగాయి. అనంతరం శ్రీ దుర్గేశ్ కుమార్ దుబే గారు, డిప్యూటీ ఛైర్మన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, ముగింపు ప్రసంగంతో రెండు రోజుల బీమ్స్ టెక్ సదస్సు విజయవంతంగా ముగిసింది.