నార్త్ లో *గాజు గ్లాస్ శిరీష” ప్రచారం
విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి వడ్డీ శిరీష గారు గాజు గ్లాసు ప్రచారణ వేగవంతం చేశారు. ఈరోజు ఉదయం అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న విశాఖ సీతమ్మధార ఏరియాలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ పై ప్రజల హర్ష వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందజేసి గాజు గ్లాస్ పై ఓటు వేయమని ఓటర్లను అడుగుతున్నారు. ప్రజలు తనపై చూపే ప్రేమాభిమానాలకి వడ్డీ శిరీష గారు ఆనందం వ్యక్తం చేశారు. తాను గెలిస్తే తన కుటుంబంతో సమానమైన ఈ నియోజకవర్గానికి నిత్యము సేవ చేస్తానని అన్నారు. ఈ ప్రచారంలో జగన్నాధ రావు, శ్రీలక్ష్మి, మహంతి, రాజశ్రీ,శరత్, ప్రసాద్, హరి, రమేష్, మొదలగున వారు పాల్గొన్నారు