ఆయుర్వేద ప్రొడక్ట్స్ ప్రారంభించిన డాక్టర్ మణి భూషణ్
![](https://www.vizagvision.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-01-at-1.11.43-PM-1024x826.jpeg)
నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి అద్వర్యం లో మెడికల్ టూరిజం లో భాగంగా ” ఆయుర్ ధన్ ” అనే నూతన సేవలను అందుబాటులోకి తెస్తున్నారు దీనిలో భాగంగా ఆయుర్వేద ప్రొడక్ట్స్ షాప్ ను ఎంవీపీ కాలనీ లో ఏర్పాటుచేస్తున్నారు. స్థానిక బే లీఫ్ రిసార్ట్స్ లో జరిగిన రక్షాబంధన కార్యక్రమం లో ముఖ్య అతిధుల సన్ మూర్తి , రామేశ్వరి అక్కయ్య , ఆయుర్వేదం డాక్టర్ హరిప్రసాద్, బెంగుళూర్ నుండి విచ్చేసిన శ్రీనివాస్ రెడ్డి సమక్షం లో ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ గారి చేతులమీదుగా ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఆవిష్కరించారు. అంగరంగ వైభవంగాజరిగిన ఈ కార్యక్రమం లో డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అన్నిరకాల వ్యాధులకు ప్రాచీన భారతీయ సాంప్రదాయ వైద్య విధానం అయినటువంటి అత్యున్నత ఆయుర్వేద ప్రొడక్ట్స్ ను అందరికి అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రొడక్ట్స్ అన్ని గవర్మెంట్ అఫ్ ఇండియా ఆయుష్ సర్టిఫికెట్ పొందినవి , వీటి వాడకం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఆరోగ్యకరమైన జీవన విధానానికి నాంది పలుకుతున్నారు . దీనితోపాటు మనిషి జీవించడానికి కావలసిన ఆర్థిక ప్రయోజనాన్ని కూడా అందరికి అందించే క్రమం లో ఈ యొక్క బిజినెస్ ను ఎవ్వరైనా చేసే లాగా భాగస్వామ్యులును చేసుకుంటున్నారు . దీనిద్వారా ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారత దిశగా ఈ కార్యక్రమం సాగుతుంది అని పిలుపునిచ్చారు. ఈ అవకాశం పూర్తిగా ఉచితం ఎవరు ముందు రిజిస్టర్ చేసుకుంటే వారికీ అందుబాటులో ఉంటుంది కావున , ఈ వినూత్న కార్యక్రమం లో మీరు పాలుపంచుకొని మీ హెల్త్ అండ్ వెల్త్ ను భవిష్యత్తులో తిరిగి వెనక్కి చూసుకోనివిదంగా మలచుకోవాలనుకుంటే …వెంటనే ఫ్రీ ఆయుర్వేద ఉపాధి కోసం 9848418582 కాల్ చెయ్యండి .
బ్రహ్మ కుమారీస్ సంస్థ నుండి వచ్చిన రామేశ్వరి అక్కయ్య గారు డాక్టర్ మణి భూషణ్ కు మరియు అతిధులకు అందరికి రక్షాబంధనం చేసి ప్రతి మానవుడు ఆరోగ్యం , ఆర్థిక ప్రగతి , ఆనందం ఎల్లప్పుడూ కలిగి ఉండాలని అందరికి అస్సిసులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఎడిటర్ నీరజభూషణ్,లావణ్య , జగన్ , ప్రసన్న ఇతర సభ్యులు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.