ఆదాని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆదాని గంగవరం పోర్ట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 36 వేలు చెల్లించాలని, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఈరోజు ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు నలుమూలల నుంచి రాకుండా ముల్లకంచెలను అడ్డుగా వేశారు. దీంతో అదాని పోర్టు పరిసర ప్రాంతాలు టెన్షన్ వాతావరణం నెలకొంది.