![](https://www.vizagvision.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-31-at-11.25.59-AM-1024x478.jpeg)
Vizagvision Visakhapatnam నాట్స్ జానపద సంబరాలు గోడ పత్రిక ఆవిష్కరణ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) , గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ ( గ్లో) మరియు మాత కళా పీఠం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు జానపద సంబరాలు కార్యక్రమం రేపు శనివారం కళాభారతిలో ఉదయం 10 నుండి మ 2 వరకు జరపబడును. భాషే రమ్యావు సేవే గమ్యం అనే నినాదంతో , జన్మభూమి కి కూడా సేవ చేయాలనే తలంపుతో జానపద కళ ని విస్తృతంగా ముందుకు తీసుకు వెళ్ళే భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అని ప్రవాస భారతీయుడు నాట్స్ కన్వీనర్ అప్పసాని శ్రీధర్ తెలిపారు.కళా హృదయాలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని గోడ పత్రిక ను ఆవిష్కరిస్తూ విన్నపం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్లో కార్యదర్శి వెంకన్న చౌదరి,శ్రీ మాతా కళా పీఠం నిర్వాహకులు పల్లి నాగభూషణం, బి. న్.మూర్తి పాల్గొన్నారు
![](https://www.vizagvision.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-31-at-11.25.59-AM-1024x478.jpeg)