సంఘటనలు
- 1932: భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
- 2007: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది.
జననాలు
- 1921: ధూళిపాళ సీతారామశాస్త్రి, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు.
- 1923: కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు.
- 1931: మోతే వేదకుమారి, భారత పార్లమెంటు సభ్యురాలు మరియు గాయని. ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి.
- 1940: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ.
- 1950: మోహిందర్ అమర్నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1961: కుడుముల పద్మశ్రీ, నెల్లూరు లోకసభ సభ్యుడు.
- 1966: అతుల్ బెదాడే, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1968: అక్కినేని అమల, ప్రముఖ నటి, జంతు సంక్షేమ కార్యకర్త, బ్లూక్రాస్ హైదరాబాద్ కన్వీనర్.
మరణాలు
- 1975: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు.
- 2004: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త.
- 2010: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
- 2012: అశ్వని, తెలుగు, తమిళ సినిమా నటి.
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ హృదయ దినోత్సవం.
- ప్రపంచ నదుల దినోత్సవం.
- ఎన్.ఎస్ .ఎస్ దినోత్సవం.